Tuesday 1 November 2016

క్రిష్ణమ్మ

     ఎప్పటిదానవమ్మా నీవు! శాతవాహన రాణుల కుచకుంకుమల సౌరభంలో సహస్రాబ్దాల క్రితం పరవశించిన మూర్తివేనా?    ధరణికోట ప్రభువుల యుధ్ధనౌకలను చుంబించిన వేయేండ్లనాటి అమరమూర్తివేనా నీవు..

     బౌధ్ధ సన్యాసినీగణ స్నానఘట్టమై చరిత్రలో చెరుగకనిలిచిన దివ్యమూర్తివేనానీవు.  నాగార్జున పాదస్పర్శతో పరుసవేదిగా మారిన భవ్యమూర్తి నీవేనాతల్లీ! అమ్మా! క్రిష్ణమ్మా! ఎందరి కవిరాజుల గుండెలగలగలలో ఇవి. ఎందరు సీమంతులు వాడిన జలకపు పరిమళమో ఇది! 

      కోకిలలకు కాలపు నిబంధనలు లేవు. శారికలకూ,కీరాల కలరుతాలకూ చీకటివెలుగులు లేవు. పండి రాలిన పళ్ళను జలపక్షులు ఒడ్డుకువచ్చి ఏరుకుతింటాయి ఎల్లవేళలా. పామో-చేపో కూడా తెలియని పొడవాటి జలచరం మెడనిక్కించి మానవుణ్ని పలకరిస్తుందిక్కడ. మూరెడు తెప్పకొయ్యతో చేపలతో పోటీపడి కాపుపిల్లలు ఆవలిఒడ్దుకు పాకుతూ పోతారు నీళ్లల్లో.




(ఇది నా చిన్నప్పుడు చదివిన నవలలోనిది.బహుశా లల్లాదేవి రచనలోనిది అనుకుంటున్నాను.మా నాన్నగారు చాలా నవలలు, అపరాధపరిషోధన సిరీస్ , గోర్కి అమ్మ,చలం రచనలు,శరత్ రచనలు ఇలా చాలా తెచ్చేవారు. అపుడు నాకు నచ్చి నా నోట్స్ లో రాసిన వాక్యాలు ఇవి)