Thursday 23 June 2016

సౌగంధి

నేనచటి కొస్తున్న వార్త నెట్లుతెలుసుకొనెనో మండు వేసవిలో తన సహజ ఉష్ణ నైజమునొదిలి సుదూర ప్రాంతాల తరలి  వచ్చిన పిల్ల గాలులు నన్నావహించి సాదరముగా ఆహ్వానించెనకటా ఇది ఏమి బాంధవ్వమో.


       మనసు పొరలలో దాగిన చెలిమి చెలమల నుండి ఆనాటి ముచ్చట్లు అంచెలంచెలుగ తోడుతున్న నా మది నెట్లుఊరడింతునిది కొంత సమయమే కానిఅధికముగా నేనుండజాలనని.

       భద్రాద్రి రామయ్య గలగలాగోదారి పసిడికాంతుల జనపచేలు,భుక్తినిచ్చిన నల్లబంగారు సింగరేణి,గోదారి గుసగుసల పైరగాలులనెట్లు మరచెదనో  మనసున్న మనిషినే ఓ నేస్తమా.

Monday 20 June 2016

యోగా దినోత్సవం.

యోగా  ప్రాణాయామం   ధ్యానం.    ఈమూడింటిమధ్య సమతుల్యత వున్నట్లయితె ఇక మనకుఎదురు లేదు.మనం ఏం మాట్లాడుతున్నామో అది చేయడం, ఏం చేస్తున్న మో అదిచెప్పడం , ఏం చెప్తున్నామో అది చేయడంవుంటూ జీవితాన్ని  స్వఛ్చంగా నిర్మలంగా వుంచుతుంది.

       ఆధ్యాత్మికత కోసం చేసినా  శారీరక దారుఢ్యం కోసంచేసినా,మానసిక ప్రశాంతత కోసం చేసినా వ్యాధులను తరిమి కొట్టడానికి చేసినా  ఇది మనకు ఎంతగానో ఉపకరిస్తుంది.ఇది సాధన చేస్తున్న పది రోజుల నుంచే మీకు మెలమెల్లగా గోచరమౌతుంటాయి కావాల్సిన అనుభూతులు.

      యోగాసనాలతో  మన శరీరాన్ని చక్కని ఆకృతిలో వుంచగలుగుతాము.ఊబకాయం,మోకాళ్ళ నొప్పులు, భుజం మెడ కళ్ళు ఇలా ఒకటేమిటి ప్రతి భాగానికి యోగాతో చికిత్స చేయవచ్చు. మన పతంజలి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో చెప్పిన యోగ చికిత్స ద్వారా మందులు వాడకుండా అన్నీ నయం చేసుకోవచ్చు.

       ప్రాణాయామం ద్వారా మెదడులో ఆక్సిజన్ పరిమాణం పెరిగి శరీరంలోని ప్రతి కణంలో ఒక నూతన ఉత్తేజం ఉరకలేస్తుంది.ద్వైదీ భావంతో ఊగిసలాడుతున్న మనసు సరైన ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఏదైనా చేయగలం అనే ధీమానిస్తుంది. నిరాశా నిస్పృహలతో వున్న మనిషి  పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేస్తే  జీవితాన్ని చాలించాలనుకున్నవారు కూడా  నేనెందుకు చావాలి  తుదిదాకా పోరాటం చేద్దాం అనే చాలెంజింగ్ మైండ్ సెట్ వస్తుంది. అందుకే స్కూల్ పిల్లలకు, జైలులో ఖైదీలకూ,గవర్నమెంట్ ఆఫీసుల లో యోగా నేర్పిస్తున్నారు.ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి .

        ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా వుంటుంది. నేటి జీవనవిధానం వల్ల ఎన్నో వత్తిళ్లు ఎదుర్కొంటునారు.ధ్యానం చేసినంతమాత్రాన వత్తిళ్లు ఎక్కడికీ పోవు.కానీ   వాటిని ఎదుర్కొనే మానసిక ధైర్యం     ధృఢత్త్వం  అలవడుతుంది. నేర ప్రవృత్తి  తొలగించబడుతుంది.ఎవరైనా మాటలతో రెచ్ఛగొట్టినా అది వారి మూర్కత్వంగానే భావించగలుగుతాము. భావోద్వేగాలు నియంత్రించబడతాయి. ముఖంలో ఏదో తెలియని కాంతి,నిర్మలమైన మనసు మానసిక పరిపక్వత సాకారమౌతాయి. కక్ష్యలు  కార్పణ్యాలు, ఆవేశాలు,రక్తపోటులు దూరమై మనిషిని మనిషి ప్రేమిస్తాడు. మన చుట్టూ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది.

       ఇది సాధన చేయడానికి ఎలాంటి ఆలోచన వద్దు. కుల మత,వర్గ, వయో,లింగ భేదం లేకుండా ప్రతి వాళ్లు వీటిని అనుసరిస్తే చక్కని ఆరోగ్య వంతమైన పౌరులు కాగలరు. కేవలం ఇవి ఒక మతానికి సంబంధించినవే కాదు  ప్రతి వాళ్లు చేసి మనసును అదుపులో వుంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకొని తద్వారా దేశాన్ని సుసంపన్నం చేయగలుగుతారు. ఒక నెలపాటు రోజూ ఉదయం  సాయంత్రం ముప్పై నిమిషాలు ఒకే టైం లో చేసి మీ అనుభూతులను మీరే బేరీజు వేసుకోండి తెలుస్తుంది.


   శాంతి శాంతి శాంతి.  ప్రపంచ శాంతి వర్దిల్లాలి.

నా న్న

               
            నాన్నే నా ప్రక్కన నిలిచి     ప్రతి పదమున తానై నడచి
          
                 నా కనుచివరల నీరయ్ మొలిచి తరగని ఆత్మీయత పరచి

                    నాతల పై తన చేయుంచి అమ్మీ అని నను ముద్దిడుతూ

                      నిమిరే మా నాన్న ఏడంటూ దిక్కు తోచని ఎడారి లోన

                                ఒంటరిగా    నే    నిలుచున్నా.

అమ్మ

ఆది దేవత రా అమ్మ  ఆమె వలదంటే లేదు ఈజన్మా. అమ్మ వున్నా ఇంటిలో లేనిది ఏదీ .అమ్మ అన్నది ఒక కమ్మని మాట .అమ్మంటేనే ఒక భరోసా ఒక హాయీ .ఎన్ని ఉపమానాలూ సరిపోని ఒకే ఒక్క పదం అమ్మ .మాది సూర్యాపేట తాలుకాలోని నూతన్కల్ గ్రామం.అన్నయ్య ,అక్కయ్య,నేనూ ,తమ్ముడు.మా చిన్నప్పుడు దాదాపు 45 ఏళ్ల  క్రితం జ్ఞాపకాలు .నాన్న నాస్తిక భావాలు  కలవాడు .ఏది వద్దనే వాడు .అమ్మకేమో మాకు గాజులు గొలుసులు అన్ని వేయాలని తపించేది.నాన్నకు తెలియకుండా కొని పెళ్లిళ్లకు పేరంటాలకు మాకు వేసేది .మా పెళ్ళిళ్ళలో కూడా అమ్మ పడ్డ సంఘర్షణ మర్చిపోలేను .అప్పటి సామజిక పరిస్థితి,సంప్రదాయాలు ఆచారాలు ఒకవైపు -నాన్న సిదాంతం ఒకవైపు .ఈ రెంటి మధ్య నలిగినా అమ్మను నేను చాల గమనిన్చేదాన్ని .అందుకే అమ్మంటే ఒకింత ఎక్కువ ప్రేమ .నా న్న సహకారంతో  అమ్మ ఊర్లో సర్పంచగా పని చేసి మంచిపేరు తెచుకున్నది .వీధి దీపాలు పెట్టించింది .మహిళామండలి సెక్రెటరీగా బాల్వాడి సెంటర్,కుట్టుమిషన్ సెంటర్ పెట్టించింది .అప్పట్లోనే ఆరోగ్యవంతమైన పాపల పోటీ పెరటితోటల పోటి పళ్ళపొడి తయారు చేయడం నేర్పించింది .నా న్న  ఎక్కువగా  మాట్లాడేవాడు కాదు.అమ్మే అన్ని చూసుకునేది .మా భూములు అమ్మడం పెద్దమనుశులతో మాట్లాడటం డబ్బులు వసూలు చెయడం లాంటి లావాదేవిలన్ని చూసుకునేది .తాతయ్య అమ్మమ్మలు వ్రుధాప్యములో చేరోమంచంలో వుంటే అమ్మ ఎంత సేవ చేసిందో చూసాను .మా   బాధ్యతలన్నీ తీరాయి,అమ్మమ్మ,తాతయ్య పోయారు ,నాన్న రిటైరయ్యారు .ఇక ప్రశాంతంగా వున్దామనుకునేవేల నాన్నకు పెరలసిస్స్త్రోక్ .ఇక అప్పటినుండి దాదాపు 6 సంవత్సరాలు నాన్నని చిన్న పిల్లాడిలాగ తినిపించడం ,మూతితుడవడం ,స్నానం చేయించడం  ఇస్త్రి బట్టలతో పెల్లిల్లకు తీసుకెళ్ళడం వేల్లకు  మందులు వేయడం చేస్తూ ఆది దంపతుల్ల లాగ తిరిగేవారు .అమ్మను చూసి ఎన్నో నేర్చుకున్నాను .ఒక స్త్రీ అంటే ఇన్ని కోణాలు వుంటాయా ఉండాలా అని .ఇంత తెలివి ,సహనం,ఓర్పు ,శ్రమ,ప్రేమ ,వాత్సల్యం ఎన్నొ పార్శ్వాలు కనిపించాయి అమ్మలో .నానన 2000 సంవత్సరంలో పోయారు .పిల్లలం ముగ్గురం సిటీలోనే ఉన్నాము .మా దగ్గర వుండమంటే ఉండట్లేదు .నావంట ,నా పనులు అన్నీ నేను చేసుకుంటూ వున్నాగా ఇప్పుడే మీ దగ్గరికి ఎందుకు వస్తాను అంటున్నది .నాకు చేతగానప్పుడు వస్తాను  అప్పుడు చూస్తాను అంటున్నది .83 సంవత్సరాల వయసులో ఆ మే పట్టుదల,స్వశక్తి మీద నమ్మకం సడలని సంకల్పం మాకు స్ఫూర్తి .అందరూ వుండి అమ్మనలా ఒంటరిగా వదిలమా అని మనసు కష్టంగా ఉంది .ఇది అంతే లేని మా అమ్మ కథ.అమ్మకు తన బాధను చెప్పుకొని ఓదార్పు పొందడానికి ఎవరూ లేరు .అన్నాతమ్ముల్లు ,అక్కాచెల్లెళ్లు లేరు .ఎన్నో సవాళ్ళను ఒంటరిగా ఎదుర్కొన్న ధీశాలి .నా జీవితంలో ఎదురైనా ప్రతి క్లిష్ట సమయంలో అమ్మైతే ఏమి చేసేది అని -అలాగే ధైర్యంతో ముందుకు సాగుతున్నాను .