ఈమధ్య మా స్నేహితులతో కలిసి కంబోడియా వెళ్ళి వచ్చాము. అక్కడ బల్లపరపుగా వున్న బండలపై ప్రవహించే వాగు లో ఆబండలపై శివలింగాలుచెక్కివున్నాయి .ఒకటో రెండో కాదు వేవేల లింగాలు అలా కనుచూపుమేర నీటిలో పారదర్శకంగా కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ఒకచోట శ్రీమహావిష్ణువు శేష శయ్యపై పవళించగా లక్ష్మీ దేవి కాళ్ళు పడుతున్న ద్రుష్యం కూడా కనబడుతోంది. దీర్గచతురస్ర ఆకార పరిధిలో యాభైయ్యారు లింగాలున్నాయి. అలా కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, మరికొంచెం పెద్దవిగా వున్నాయి. పచ్చని పరిసరాలతో చల్లనిగాలులతో మనకు స్వాగతం పలుకుతోంది. పవిత్ర జలమని ఆనీటిని తీసుకుని తలపై చల్లుకుంటూ తన్మయులయ్యాము. ఆపక్కనే ఊయల ఏర్పాటు చేశారు ఎందుకోఏమో. తలాకాసేపు ఊగుతూ సంబరపడినాము. ఒక్క సారి ఊహించండి ఎంతటి ఆనందం మన సొంత మో.
కంబోడియా రాజుకి ఈనీటితో మంగళస్నానం చేయించేవారట. అంకుర్వాట్ ఆలయ పరిసరాల్లోని ఈపవిత్రజలాల్ని దాదాపు నాలుగైదు గంటల ప్రయాణ సమయం తర్వాత రాజధాని ఫెనాంఫెన్ లోని రాజప్రాసాదానికి తెచ్చి గంగాళాల్లో నింపి మంత్రోఛ్చారణలతో స్నానం చేయించేవారట.