Monday 13 February 2017

అక్షరవనం



   నిన్ననేను ఒకమంచి కార్యక్రమానికి వెళ్ళాను .హైదరాబాదు నుండి రెండుగంటల ప్రయాణం కారులో. శ్రీశైలం వేళ్ళేదారిలో కల్వకుర్తి అనే ఊరిలో వందేమాతరం ఫౌండేషన్ వారి అక్షరవనం కార్యక్రమానికి వెళ్ళడంజరిగింది .మాధవరెడ్డిగారు తన స్వంతవ్యవసాయభూమిని, తన సమయాన్ని,తన పరివారం మొత్తంగా ఈప్రాజెక్టు పైనే వెచ్చిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు .ప్రభుత్వ పాఠశాలలనుండి పేద విద్యార్థులను తెచ్చి వారికి శిక్షణ ఇచ్చి వారిపై రీసెర్చి చేస్తూ భావి విద్యార్థులకు మేలైన విద్యను ఎలా అందించాలనే ఆలోచన ఆయనది. ఒక గ్రంధాలయం,ధ్యానమందిరం నిర్మాణంలో మాకుటుంబం పాలుపంచుకోవడం గర్వించదగిన విషయమని నేననుకుంటున్నాను. విశాలమైన వరండాలు,కూర్చోడానికి గ్రానైటుబెంచీలు,చుట్టూ మామిడిచెట్లు,చింతచెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో అక్షరవనం రూపుదిద్దుకుంటున్నవైనం నన్నెంతో ఆకర్శిస్తూంది. వారి నినాదం చదవండి మరచిపోండి. బట్టీ విధానం కాకుండా చదువంటేభయంలేకుండా చేయడం. బడిపుస్తకాలు కాకుండా గ్రంధాలయంలోని పుస్తకాలు వారికిఅందుబాటులో వుంచి దాదాపు ప్రతి విద్యార్థి రెండువందల పుస్తకాలైనా చదవాలని,చదివినవి మెదడులో ఎక్కడో నిక్షిప్తమై వుంటాయనేవారి ఆలోచన బాగుంది. అలాగే పిల్లలే వంటచేయడం,అన్నిపనులు నేర్చుకోవడం వారికున్న నైపుణ్యాలుప్రదర్శించడం,వారే గురువులుగా మారిచెప్పడం, అన్ని విధాలుగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తున్నారక్కడ. గవర్నమెంటు టీచర్లు దాదాపు రెండువేలమంది ఇక్కడ ట్రైనింగు తీసుకుని వెళ్ళారంటే వీరి శ్రమ కృషి ఏపాటివో మనం అర్థం చేసుకోవాలి.  మాధవరెడ్డిగారి కుటుంబానికి,ఆ మహా యగ్నంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వారు ధన్యులు.